Wednesday 5 November 2014

నడుము నొప్పితో బాధపడుతున్నారా?

                             ప్రతిరోజూ నడుమునొప్పితో బాధపడుతూ నిద్రలేస్తుంటే మాత్రం దానికి మీరు వాడే పరుపు
 కూడాకారణం కావచ్చు.పరుపు ఏమాత్రం గుంత పడినట్లనిపించినా కూర్చున్నప్పుడైనా,పడుకున్నప్పుడైనా జాగ్రత్తగా గమనించి దాన్ని మార్చేయాలి.లేకపోతే అది నడుము నొప్పికి కారణమవుతుంది.ఒకపరుపు ఆరునుండి పది సంవత్సరాలు మాత్రమే బాగా పనిచేస్తుంది.ఆతర్వాత గట్టిదనం కోల్పోయి నడుము నొప్పికి కారణమవుతుంది.
                           నడుము నొప్పి ఏ కారణంతో వచ్చినా దానికీ ఒక చిట్కా ఉంది.అదేమిటంటే కుడిచేతి గుప్పెట మూసి అంటే  మిగతా నాలుగు వ్రేళ్ళు ముడిచి బొటన వ్రేలు మాత్రం పొడవుగా పెట్టి ముంజేతి(మణి కట్టు)నుండి బొటన వ్రేలు గోరు చివరి వరకూ ఎముక పై ఎడమ చేతి బొటన వ్రేలుతో నొక్కాలి.మళ్ళీ ఎడమ చేతి గుప్పెట మూసి బొటన వ్రేలు ఎముకపై గోరు చివరి వరకు పై విధంగానే కుడిచేతి బొటన వ్రేలితో నొక్కాలి. ఇలా 5,6 సార్లు రెండుచేతుల వ్రేళ్ళు నొక్కాలి.నడుము నొప్పి ఉంటే ఎముకపై నొక్కినప్పుడు నొప్పి వస్తుంది.కానీ నిమిషాలలో నడుము నొప్పి మటుమాయమౌతుంది.
గమనిక:చేతి పైవైపున పైన చెప్పిన విధంగా ఎముకపై గోరుపైన కూడా మరోచేతి బొటన వ్రేలితో మాత్రమే నొక్కాలి.
కొంచెం నడుము నొప్పి అయితే వెంటనే తగ్గిపోతుంది.ఎక్కువ కాలం నుండి ఉన్న నొప్పి అయితే కొంత సమయం పడుతుంది. 

2 comments:

  1. Can you please explain more?

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా.మరల వివరణ ఇచ్చాను.చేతి పై వైపు ఎముకపై గోరు పైనకూడా వేరే చేతి బొటన వ్రేలితో మాత్రమే నొక్కాలి.

      Delete