Wednesday 9 July 2014

అరుగు రాజకీయాలు

                       పల్లెల్లో అందరి ఇళ్ళముందు కూర్చుని మాట్లాడుకోవటానికి అరుగులు ఉంటాయి.దాదాపు అందరి
ఇళ్ళల్లో పెద్దపెద్ద చెట్లు ఉంటాయి.అందుకని ఏ టైములోనయినా అరుగులకు నీడ ఉంటుంది.ఆడవాళ్ళు ఖాళీగా
ఉన్నప్పుడు అందరూ అరుగులమీద కూర్చుంటారు.మగవాళ్లందరూ ఇంకోప్రక్కన మీటింగు పెడతారు.ఆమీటింగు
పెట్టినప్పుడు ఉల్లిపాయ,చింతపండు దగ్గరనుండి ముఖ్య మంత్రులు,ప్రధాన మంత్రుల వరకూ చర్చలు జరుగుతూ ఉంటాయి.పెరగబోయే నిత్యావసర ధరల నుండి లోక్ సభ రాజ్యసభల్లో తీసుకోబోయే నిర్ణయాల గురించికూడా వీళ్ళే
ఊహించి ముందే చెప్పేస్తుంటారు.అక్కడ కాసేపు కూర్చుంటే చాలు పేపరు చదవాల్సిన అవసరం లేదు.అంతెందుకు రైల్వే బడ్జెట్ లోని లోపాలు ఏమిటి?ఎవరికి అనుకూలంగా ఉపయోగంగా ఉంది ?అన్నది వాళ్ళే నిర్ణయించేస్తారు.ఇక
ఆడవాళ్ళు మార్కెట్లో పిన్నీసు మొదలు సత్యపాల్ డిజైనర్ చీరల వరకూ మాట్లాడేస్తుంటారు.కొంచెంసేపు అక్కడ కూర్చుంటే చాలు మనకు ఎన్నో క్రొత్తక్రొత్త విషయాలు తెలుస్తుంటాయి.వెళ్ళి కూర్చున్నవాళ్ళు నోరు తెరవక తప్పదు.









No comments:

Post a Comment