Tuesday 1 July 2014

తనదయితే -ఎదుటివాళ్ళదయితే

                              రాఘవేంద్రరావుగారు ఉద్యోగంచేస్తూ వ్యాపారంకూడా చేస్తుంటారు.తనదయితే ఒక రూపాయిది రెండు రూపాయలు చెప్పటం,ఎదుటివాళ్ళదయితే రూపాయిది పావలాకి అడగటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
తన,పర భేదం ఉండదు.ఎదుటివాళ్ళను ఎంత బాగా ఉపయోగించుకోవచ్చోఆయనకు బాగా తెలుసు.అందుకే రెండు పడవలమీద కాళ్ళు వేసినా రాణించగలిగారు.రెండు పడవలమీద కాళ్ళు వెయ్యగూడదని శాస్త్రం.నేర్పరితనం,కష్టపడే
తత్వంవల్ల కలిసొచ్చింది.అయినా ఎదుటివాళ్ళది మరీ పావలాకి అడగటం దారుణం.ఈరోజుల్లో ఎక్కువమంది ఇలాగే
ఉంటున్నారు.కలికాలం కదా!తనదగ్గర ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా చాలా తక్కువ జీతాలకు ఎక్కువపని చేయించుకోవటం,తనకు ఉపయోగపడతారనుకుంటే పని చేయకపోయినా అదే జీతం ఇవ్వటం అలవాటు.ఇది ఒక
వ్యాపారరలక్షణం.ఏంచేస్తాం?అయిన సరయిన ఉద్యోగాలు దొరక్క దానిలో పనిచేసినా చాలులే అని వెళ్తుంటారు.

No comments:

Post a Comment