Wednesday 23 July 2014

నారింజ పులిహోర

           నారింజ పండు తియ్యతియ్యగా,పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.ఈరసం క్రమం తప్పకుండ పరగడుపున 41 రోజులు తీసుకుంటే సంతాన సాఫల్యత పెరుగుతుంది.డయాబెటిస్,హార్ట్ పేషెంట్స్ కి ఈపండు ఎంతో మంచిది.కాన్సర్
ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు నారింజలో సమృద్ధిగా ఉంటాయి.ఎసిడిటీని తగ్గిస్తుంది.
         నారింజ కాయ పులిహోరకు చాలా బాగుంటుంది.ఇప్పుడు నారింజ కాయలు ఊరిలో చెట్ల నిండా విరగకాసి చూడ ముచ్చటగా ఉన్నాయి.పులిహోర చేయాలంటే మధ్యరకం కాయలు బాగుంటాయి.పిందెలు కాకుండా,పండ్లు కాకుండా మధ్యరకంగా ఉండాలి.
                                           బియ్యం  - 4 రైసు కుక్కర్ కప్పులు
                                          నారింజ కాయ - 1 మీడియం సైజుది,పుల్లనిది
                                           పసుపు - కొంచెం,ఉప్పు - సరిపడా
                                          నూనె - సరిపడా
                                          తాలింపు దినుసులు
                                         కరివేపాకు - కొంచెం,పచ్చిమిర్చి - 6
                  ముందుగా  బియ్యం కడిగి అన్నం వండాలి.కొంచెంసేపయ్యాక అన్నం ఒక పెద్ద ప్లేటులో వేసి ఆరబెట్టాలి.
స్టవ్ పైన బాండీలో నూనె వేసి కాగిన తర్వాత రెండు ఎండుమిర్చివేసి,ఆవాలు,మినప్పప్పు,శనగపప్పు ఒక్కొక్క స్పూను చొప్పున వేసి వేగనిచ్చి కరివేపాకువేసి వేగనిచ్చి,పసుపు,పచ్చిమిర్చివేసి వేగిన తర్వాత అన్నంలో వెయ్యాలి.కావాలనుకుంటే జీడిపప్పుకానీ,పల్లీలు కానీ వేయించి కలుపుకోవచ్చు.ఈలోపు నారింజరసంతీసి,ఉప్పు
 వేసి కలిపి ప్రక్కనపెట్టుకుని తాలింపు, అన్నంలో వేయగానే రసం కూడా అన్నంలో పోసి బాగా కలిసేట్లుగా కలపాలి.నారింజ కాయ పులిహోర రెడీ.ఇది పిల్లలకు లంచ్ బాక్స్ లోకి రుచిగా ఉంటుంది.పెద్దవాళ్ళకు కూడా పుల్లపుల్లగా తినటానికి బాగుంటుంది.నిమ్మకాయ పులిహోర రుచికి ఇది భిన్నమైన రుచి.

No comments:

Post a Comment