Sunday 20 July 2014

ఆలూ - క్రిస్పి

         బంగాళ దుంపలు - 4
         ఉప్పు,కారం - తగినంత
         జీడిపప్పు - మన ఇష్టం
         కరివేపాకు - కొంచెం
             ముందుగా బంగాళదుంపల్నికడిగి చెక్కు తీసి కొంచెం పెద్దగా తురమాలి.తురుము రంగు మారకుండా
కొంచెం నీళ్ళల్లో వేసి బాగా చేతితో పిండి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.వేయించటానికి సరిపడా నూనె బాండీలో పోసి బాగా కాగిన తర్వాత తురుము కొంచెం కొంచెం నూనెలో చల్లుతున్నట్లుగా వేయాలి.లేకపోతే ఉండలు కట్టినట్లుగా ముద్దగా వస్తుంది.వేయగానే అటుఇటు త్రిప్పి బంగారు వర్ణం రాగానే తీసేసి పేపర్ మీద వేయాలి.మొత్తం అలాగే వేయించుకోవాలి.తర్వాత కొంచెం నూనెలో కరివేపాకు వేసి వేగినతర్వాత జీడిపప్పు వేయించి సరిపడా ఉప్పు,కారం వేయించిన ఆలూవేసి ఒకసారి త్రిప్పిబౌల్ లో వేస్తే ఆలూ క్రిస్పి రెడీ.ఇది కరకలాడుతూ క్రిస్పీగా,రుచిగా ఉంటుంది.
చేయటం కూడా చాలా తేలిక.పిల్లలు,పెద్దలు కూడా ఇష్టపడతారు.
గమనిక :ఎక్కువ వేయించితే మాడిపోయి రుచిగా ఉండదు.

No comments:

Post a Comment