Tuesday 8 July 2014

తోడుదొంగలు

              నరేష్,రూపేష్ ఇద్దరు మేనమామ,మేనల్లుళ్ళు.వీళ్ళిద్దరూ కలిసి విదేశాలలో ఉన్న స్వరూప్ అంటే నరేష్
స్వంత అన్న,రూపేష్ స్వంత మేనమామని మోసంచేసి స్వరూప్ కి తెలియకుండా స్వరుప్ కి చెందాల్సిన ఆస్తిని
పెద్దవాళ్ళని బెదిరించి నరేష్ ముప్పావు వంతు,రూపేష్ పావు వంతు రిజిస్టర్ చేయించుకున్నారు.ఒకసారి విదేశాలనుండి వచ్చినప్పుడు స్వరూప్ కి ఈవిషయం తెలిసింది.ఇదేమి పద్ధతి అంటే ఇద్దరూ నేలచూపులు చూస్తూ తలలు దించుకున్నారు.తర్వాత విడివిడిగా స్వరూప్ ని కలిసి ఎవరికి వాళ్ళునాది తప్పుకాదు అంటే నాదితప్పు కాదని నరేష్ బెదిరించి రాయించుకున్నాడని రూపేష్,రూపేష్ కాకాపట్టి పెద్దవాళ్ళతో రాయించుకున్నాడని నరేష్ చెప్పటం మొదలుపెట్టారు.మీ ఇద్దరిదీ తప్పే అందరం ఒకచోట కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా ఏ పనైనా
చేసుకోవటం పద్ధతి అంతే కానీ మీఇష్టం వచ్చినట్లు చేయకూడదు కదా!అని స్వరూప్ ఇద్దరినీ చివాట్లు పెట్టాడు.
ఇద్దరు ఇద్దరే తోడుదొంగలు.తప్పు కప్పిపెట్టుకోవటానికి నాటకాలాడుతున్నారని,డబ్బుకి గడ్డితినటం మాని
ఎప్పుడు బాగుపడతారో అని స్వగతంగా అనుకున్నాడు.   

No comments:

Post a Comment