Wednesday 2 July 2014

బ్రతుకుతెరువు-మార్పు

                        బ్రతుకుతెరువు కోసం ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళటం,కష్టపడి ఎవరికి తగినపని వాళ్ళు చేసుకోవటం సహజం.కానీ ఈప్రపంచంలో విలాసంగా బ్రతకటానికి ఎక్కువమంది తేలిక మార్గాన్నిఅంటే అన్నీ  అబద్దాలాడటం,మోసాలు,మాయలుచెయ్యటం ఈరోజుల్లోఒక వ్యాపకంగా పెట్టుకుంటున్నారు.నాలుగు కబుర్లుతో
ఎదుటివాళ్ళను మాయాజాలంలో పడేయటం ఫ్యాషనైపోయింది.అతిత్వరలో మీడబ్బుని రెట్టింపు చేస్తామంటే అది
అసాధ్యమని తెలిసినా ప్రజలు కూడాఅది నిజమేనేమో ఏపుట్టలో ఏపాము ఉందో పెట్టిచూద్దాం అనుకోవటం గుడ్డిగా
మోసపోవటం జరుగుతుంది.పెద్దపెద్దఉద్యోగాలిప్పిస్తాం ముందు కొంతడబ్బు డిపాజిట్ చెయ్యమనటం అది నమ్మి  చదువుకున్నవాళ్ళు కూడా చదివినదానికి తగిన ఉద్యోగం వస్తుంది కానీ పెద్దది ఎక్కడనుండి ఇస్తాడనే ఆలోచన లేకుండా అప్పుతెచ్చి అయినా పెట్టేయటం మోసపోవటం తర్వాత లబోదిబోమనటం అలవాటయింది.వీటన్నిటికీ పెట్టకుండా స్వయంఉపాధి మార్గాన్నిఎంచుకోవటం మేలు.లోన్ ఇప్పిస్తామంటూ అక్కడా మోసమే అందుకే జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి.మీరు రెండునెలల్లోనే మాదగ్గరకొస్తే ప్రావీణ్యం సంపాదిస్తారు ఎంతోఎత్తుకు ఎదుగుతారు అని చెప్పేవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు.ఆరకంగా సంపాదించే వాళ్ళు జీవితంలో పైకి రాలేరు.అది తెలుసుకుంటే బాగుంటుంది. మోసపోయేవాళ్ళుఒకసారి మోసపోతారు.దాన్నుండి గుణపాఠం నేర్చుకోవాలి. మోసంచేసేవాళ్ళు అందర్నీ చెయ్యలేరు.ఎప్పుడో ఒకసారి ఎదురుదెబ్బ తగలక మానదు.బ్రతకటానికి వక్రమార్గాన్ని ఎంచుకోనక్కర్లేదు.
నిజాయితీతో మామూలు భోజనం తిన్నాఅరిగి ఒంటికి పడుతుంది.అక్రమార్జితంతో పంచభక్ష్యపరమాన్నాలు తిన్నా
అరగక ఆస్పత్రులచుట్టూ తిరగాల్సివస్తుంది.అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు.అందరూ నిజాయితీతో ఉంటే  ఈప్రపంచం ఎప్పుడో బాగుపడేది.ఇన్నినేరాలు, ఘోరాలు ఉండేవికాదు.ఇప్పుడిప్పుడే ప్రజలు నిజాయితీ విలువ తెలుసుకుంటున్నారు.ఇకనైనా అందరిలో మార్పు వచ్చి నేరాలు,ఘోరాలు తగ్గి అందరు సుఖశాంతులతో ఉండాలని ఆశిద్దాం.ఇది ఏ కొద్దిమందితోనో సాధ్యమయ్యేది కాదు.అందరిలో మార్పు రావాలి.

No comments:

Post a Comment