Sunday 20 July 2014

పరమాత్ముని పండు

                 పరమాత్ముని పండు అంటే బొప్పాయి పండు.బొప్పాయి పండుని అందరు ఇష్టపడరుకానీ దీనిలో ఎన్నో
పోషకపదార్దాలు ఉంటాయి.ఎ,బి,సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.మలబద్దకం లేకుండా చేస్తుంది.రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహం,గుండెజబ్బుల బారినపడకుండా చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బాగా పండిన బొప్పాయిపండు చాలా రుచిగా ఉంటుంది.బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.పచ్చికాయ తో కూర చేసుకోవచ్చు.చెక్కు తీసి ముక్కలుకోసి ఉడికించి బాగాపిండి,మెత్తగా కాకుండా (బద్దగాఉండాలి)ఉడికించిన కందిపప్పుతో కలిపి వేపుడు చేస్తే చాలా బాగుంటుంది.పచ్చిబొప్పాయి ముక్క వేస్తే ముదురుమాంసం కూడా మెత్తగా ఉడుకుతుంది.తల్లిపాల వృద్దికి పచ్చిబొప్పాయి మంచిది.బాగాపండిన బొప్పాయి
గుజ్జు,తేనెకలిపి మొహానికి,మెడకు అప్లై చేసి ఒకపది ని.ల.తర్వాత కడిగితే నున్నగా మెరుస్తుంది.ఇన్నిరకాలుగా బొప్పాయి వలన ఉపయోగాలు ఉన్నాయి కనుకనే దీనిని పరమాత్ముని పండు అని అంటారు.    

No comments:

Post a Comment