Saturday 26 July 2014

కంటి చూపు మెరుగుపడాలంటే.........

              శరీరం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.ఇప్పుడు టి.వి.,కంప్యూటర్లతో కాలక్షేపం ఎక్కువైంది కనుక
చిన్నపిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళవరకూ కంటి చూపు తగ్గుతోంది.ఇంతకు ముందు రోజుల్లో ఇవేమీ లేవు కనుక
ఇప్పటికీ పెద్దవాళ్ళు సూదిలో దారం సునాయాసంగా ఎక్కించగలరు.ఈరోజుల్లో పిల్లలు కూడా సూదిలో దారం  ఎక్కించలేకపోతున్నారు.అందుకే కంటిచూపు మెరుగ్గా ఉండటానికి కొన్ని తప్పక పాటించాలి.అవేమిటంటే....
మనం వీలయినంత తరచుగా పొన్నగంటికూర,మునగాకు ఆహారంలో భాగం చేసుకోవాలి.ఈ రెండురకాలఆకులతో పప్పు చేసుకోవచ్చు.పెసర,కంది పప్పులు కొంచెం ఉడికించి,ఉల్లిపాయ,పచ్చి మిర్చి వేసి వేపుడు చేసుకోవచ్చు.
కారట్ ఏదోఒకరూపంలో అంటే రసం,హల్వా,కూర ఎలాగైనా ఎక్కువగా తినాలి.బాదంపాలు రోజు రాత్రిపూట త్రాగాలి.
 దీనితోపాటు కంటి వ్యాయామం కూడా చెయ్యాలి.కనుబొమలు కొంచెం నొక్కాలి.కొంచెం గోరు వెచ్చటి నీళ్ళల్లో
కర్చీఫ్ పిండి 5 ని.లు కళ్ళమీద పెట్టుకోవాలి.నువ్వులనూనె 2 చుక్కలు కళ్ళ చుట్టూ రాయాలి.కళ్ళు పైకి,క్రిందికి,
ప్రక్కకు,గుండ్రంగా త్రిప్పాలి.ఇవన్నీచేస్తుంటే తప్పకుండా కంటిచూపు మెరుగుపడుతుంది.వీటితోపాటు ఆరునెల్లకు ఒకసారయినా పిల్లలు,పెద్దవాళ్ళు కూడా కంటివైద్యునితో పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి.  

No comments:

Post a Comment