Friday 25 July 2014

చిరుధాన్యాలతో దోసె

                              కావలసిన పదార్ధాలు

                       మినపప్పు - 1 కప్పు
                       బియ్యం -  1 కప్పు
                   మల్టీ మిల్లెట్ పౌడర్ - 2 కప్పులు
                      మెంతులు - 1 స్పూను
                      జీరా  - 2 స్పూన్లు
               
                             మినప్పప్పు,బియ్యం విడివిడిగా 4 గం.లు నానబెట్టుకోవాలి.నానబెట్టే ముందు కడిగితే త్వరగా నానతాయి.మిక్సీలో వేసే ముందు ఒకసారి కడిగి విడివిడిగా మెత్తగా రుబ్బుకుని జీరా,మెంతులువేసి, మిల్లెట్ పిండి
(రాగి,జొన్న,సజ్జ,మొ.న 11 రకాల చిరుధాన్యాలతో చేసిన పిండిసూపర్ మార్కెట్లో దొరుకుతుంది) కొంచెం నీళ్ళతో తడిపి దీన్నికూడా వేసి ఒకసారి ఆన్ చేయాలి.మొత్తం కలిపిన పిండిని 7,8 గం.లు బయటే పులవనిచ్చి దోసె వేసుకుంటే  నోరూరించే ఆరోగ్యకరమైన మల్టీ మిల్లెట్ దోసె తినడానికి రెడీ.ఎక్కువ ఉంటే పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.
                    దీన్ని కొబ్బరిచట్నీ,అల్లంపచ్చి మిర్చి చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.

గమనిక :మల్టీ గ్రైన్ ఆటా కాదు.మల్టీ మిల్లెట్ పౌడర్ 

No comments:

Post a Comment