Friday 25 July 2014

కరకరలాడే పకోడీలు

             శనగపిండి(బేసన్) - 1/4 కే. జి
             వరి పిండి(బియ్యప్పిండి) - గుప్పెడు
             ఉల్లిపాయలు - 4 మీడియం సైజ్
             పచ్చి మిర్చి  - 6
            అల్లం  - చిన్నముక్క
           నూనె  - వేయించటానికి సరిపడా
          వెన్న - కొంచెం
         ఉప్పు - సరిపడా
                      ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా,పొడవుగా కట్ చేసుకోవాలి.వెన్న,ఉప్పు,అల్లం,పచ్చిమిర్చి ముద్ద
వేసి బాగా కలపాలి.తర్వాత శనగపిండి,బియ్యప్పిండి వేసిఅవసరమైతే కొంచెం నీళ్ళు పోసి మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.బాండీలో నూనె పోసి కాగాక కొంచెం పిండి చేతిలో తీసుకునినాలుగు వేళ్ళపై ఉంచి బ్రొటన వ్రేలితో
గుండ్రంగా త్రిప్పుతూ సన్నగా పడేలాగా నూనెలో వేయాలి.ఇటు,అటు త్రిప్పి బంగారు వర్ణంలోకి రాగానే తీసి ఒకప్లేటులో పేపర్ పై వెయ్యాలి.చాల త్వరగా కూడా వేగుతాయి.అన్నీ అలాగే వేయించితే కరకలాడే నోరూరించే వేడివేడి పకోడీ రెడీ.స్పైసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. వెన్న కొంచెం వెయ్యటంవల్ల అదనపు రుచి వస్తుంది.ఒకవేళ సమయానికి వెన్న లేకపోతే వేడివేడి నూనె వేసి కలిపినా రుచిగానే ఉంటాయి.


 





No comments:

Post a Comment